విజయ్ దేవరకొండ, శాలిని పాండే జంటగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమా హిందీలో షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా 'కబీర్ సింగ్' టైటిల్‌తో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగ కబీర్ సింగ్ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నాడని తెలియడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీ సిరీస్ అధినేత క్రిషన్ కుమార్, భూషణ్ కుమార్, సినీ1 స్టూడియోస్ అధినేతలు అశ్విన్ వర్ధె, మురద్ కేతానిలతో కలిసి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఇవాళే ఆడియెన్స్ ముందుకొచ్చింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదట్లో కబీర్ సింగ్ సినిమా కోసం రణ్‌వీర్ సింగ్‌ని తీసుకోవాలని భావించినప్పటికీ.. ఏవేవో కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఆ తర్వాతే షాహీద్ కపూర్ అర్జున్ రెడ్డి రీమేక్‌కి సైన్ చేశాడు.