KGF Director Prashanth Neel Donates Rs 50 Lakhs To Eye Hospital in own Village: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులు సాధించిన చిత్రం ఏదైనా ఉంది అంటే అది కేజిఎఫ్ 2 అని మాత్రమే చెప్పాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఒక అద్భుత దృశ్యకావ్యంగా నిలిచింది. కేవలం హీరో ఎలివేషన్స్ మీదే ఆధారపడి రెండు సినిమాలు రూపొందించడం ఆ రెండు సినిమాలు కలిపి దాదాపు 2000 కోట్ల రూపాయలు వ్యాపారం చేయడం అనేది మామూలు విషయం కాదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ దెబ్బతో రాజమౌళి తర్వాత దేశంలో టాప్ డైరెక్టర్ లిస్టులో కూడా ప్రశాంత్ నీల్ చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం సౌత్ ని వదలకుండా ప్రభాస్ తో ఒక సినిమా ఎన్టీఆర్ తో ఒక సినిమా ఇప్పటికే లైన్లో పెట్టారు ప్రభాస్ తో చేస్తున్న సలార్ సినిమా వచ్చే ఏడాది విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు.


అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా అప్డేట్ ఇవ్వడం కూడా ఆసక్తికరంగా మారింది అయితే ఆ అప్డేట్ ఇవ్వడానికి గల కారణం ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా నీలకంఠాపురం అనే తన స్వగ్రామానికి విచ్చేయడమే. స్వగ్రామానికి వచ్చిన ఆయన మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మిస్తున్న సంగతి తెలుసుకున్నారు. నిజానికి రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి సోదరుడి కుమారుడే ఈ ప్రశాంత్ నీల్. సుభాష్ రెడ్డి గతంలోనే అనారోగ్య కారణాలతో కన్నుమూయగా ఆయన సమాధి కూడా నీలకంఠాపురంలోనే ఉంటుంది.


ప్రశాంత్ ఏదైనా మంచి పని ప్రారంభించే ముందు అలాగే తన తండ్రి జయంతి,  వర్ధంతి సందర్భంగా తన తండ్రి సమాధి సందర్శించి కాసేపు అక్కడే సమయం గడుపుతూ ఉంటారు. ఆగస్టు 15వ తేదీ సుభాష్ రెడ్డి జయంతి కావడంతో ప్రశాంత్ తండ్రి సమాధి వద్దకు వెళ్లి అక్కడే కాసేపు సమయం గడిపారు. ఇక తనకు బాబాయి వరస అయ్యే రఘువీరారెడ్డి ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నారనే విషయం తెలుసుకొని హాస్పిటల్ కి అక్కడికక్కడే 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు.


ఈ విషయాన్ని రఘువీరారెడ్డి తన సోషల్ మీడియా వేదికగా ఒక చిన్న వీడియో ద్వారా పంచుకున్నారు. ఇక ప్రశాంత్ ఉగ్రం అనే సినిమాతో కన్నడ దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత చేసిన కేజిఎఫ్ సినిమా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టింది. అలాగే కేజిఎఫ్ 2 కూడా సూపర్ హిట్ గా నిలవడంతో ప్రస్తుతం అయిన ప్రభాస్ తో సాలార్ అనే సినిమా చేస్తున్నాడు. అది పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ తో 31వ సినిమా చేయబోతున్నాడు. చాలా తక్కువ సినిమాలతోనే స్టార్లతో పనిచేసే అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. అలాంటి అవకాశం ప్రశాంత్ నీల్ కి దక్కిందని చెప్పొచ్చు.
Also Read: Sahithi: హీరోయిన్ గా శేఖర్ మాస్టర్ కూతురు సాహితి.. హీరో ఎవరంటే?


Also Read: Puri Jagannadh: దేవరకొండ నిజస్వరూపం బయటపెట్టిన పూరీ.. ఇలాంటోడు ఉండడు అంటూ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి