ముంబై: భారత దేశం గర్వించదగిన ప్రముఖ నేపథ్యగాయని, దాదాసాహెబ్ ఫాల్కె, భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాల గ్రహీత లతా మంగేష్కర్ అస్వస్థతతో ఆస్పత్రిపాలైనట్టుగా శుక్రవారం పలు వదంతులు వ్యాపించాయి. ఈ వదంతులపై స్పందించిన లతా మంగేష్కర్.. తాను పూర్తి ఆరోగ్యంగా వున్నానని, ఆ పుకార్లను నమ్మొద్దని తెలిపారు. తాను ఇంట్లోనే నిక్షేపంగా, క్షేమంగా వున్నానని ఆమె ట్విటర్ ద్వారా వెల్లడించారు. యావత్ భారతావనిని తన గానంతో ఓలలాడించిన లతమ్మకు ఏమైందో ఏమోనని కంగారుపడిన అభిమానులు ఆమె ట్వీట్ చూసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.