హైదరాబాద్: భర్త ఓ గదిలో క్వారంటైన్‌లో Quarantine ఉండగా ఆ గది తలుపులకు బయటి నుంచి తాళం వేసిన భార్య ప్రియుడితో పారిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌ జిల్లాలో ముందేరి గ్రామంలోచోటుచేసుకుంది. బయటి నుంచి తాళం వేసి ఉన్న విషయాన్ని గుర్తించిన భర్త ఇతరుల సాయంతో బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో భవన నిర్మాణ రంగంలో ఓ వ్యక్తి కూలీగా పని చేస్తున్నాడు. అతడి భార్యాపిల్లలు ఇదివరకు ఢిల్లీలోనే ఉండి, ఏడాదిన్నర క్రితం సొంత గ్రామం ముందేరికి వచ్చి అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  ఖతర్నాక్ ఫొటోలు వదిలిన కేథరిన్


మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా ఆమె భర్త కూడా ఇటీవల సొంతూరికి వచ్చాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆ వ్యక్తి తన ఇంట్లోని పై అంతస్తులో 14 రోజుల క్వారంటైన్‌లో ఉంంటున్నాడు. భార్యాపిల్లలు మాత్రం కింది‌ ఫ్లోర్‌లో ఉంటున్నారు. అయితే తన భర్త ఇంటికి రావడంతో తన ప్రియుడిని ఇక కలవలేనేమోనని భయపడిన ఆమె భర్తను గదిలోనే ఉంచి తాళం వేసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..