Krishna And indira devi Marriage Anniversary : ఘట్టమనేని ఫ్యామిలీకి ఈ ఏడాది ఎంతంటి నష్టాన్ని మిగిల్చింది, బాధను ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది జనవరిలో రమేష్ బాబు, సెప్టెంబర్‌లో ఇందిరా దేవి, నవంబర్‌లో సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. ఇలా వరుస మరణాలతో మహేష్ బాబు, ఘట్టమనేని ఫ్యామిలీ కుంగిపోయింది. తాజాగా మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని తన తల్లిదండ్రులను తలుచుకుంటూ ఎమోషనల్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 





కృష్ణ, ఇందిరా దేవీల పెళ్లి రోజు (నవంబర్ 22) అంటూ మంజుల ఘట్టమనేని పోస్ట్ వేసింది. ఈ ఇద్దరి జోడి ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే స్వర్గంలోనూ ఇప్పుడు ఇలా జంటగానే ఉన్నారు.. అమ్మ చనిపోయిన తరువాత డాడీ ఆమెను చాలా మిస్ అవుతుండే వాడు.. అందుకేనేమో.. మా అందరినీ వదిలేసి.. అమ్మతో ఉండేందుకు వెళ్లిపోయారు.. వారిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలనే అనుకున్నారు.. అరవై ఏళ్లకు పైగా ప్రయాణం.. ఐదుగురు పిల్లలతో చక్కని కుటుంబం.


వాళ్లు నా తల్లిదండ్రులైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.. రుణపడి ఉంటాను.. మాపై ఎప్పుడూ అమితమైన ప్రేమను కురిపించారు.. వారిలా కనీపం పదిశాతమైనా ఉన్నా, జీవించినా అదే మేం వాళ్లకు ఇచ్చే గిఫ్ట్ అవుతుంది.. అమ్మానాన్నకు వివాహా వార్షిక దినోత్సవ శుభాకాంక్షలు అని మంజుల చెప్పుకొచ్చింది.


సెప్టెంబర్ 28న ఇందిరా దేవీ కన్నుమూయగా.. నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. గంగానదిలో ఇందిరా దేవీ అస్థికలను మహేష్‌ బాబు కలిపాడు. ఇక గత వారం కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో కలిపారు.


Also Read : Samantha HBD Naga Chaitanya : నాగ చైతన్య బర్త్ డే.. సమంత పోస్టులు వైరల్.. అంత ప్రేమ ఎక్కడికిపోయింది?  


Also Read : Jabardasth Varsha : వర్షించే అందం అంటే ఇదేనా?.. జబర్దస్త్ వర్ష వింత జాకెట్.. పిక్స్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook