టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమాలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న ఆడియెన్స్ ముందుకు రానుంది. మహర్షి మూవీ తర్వాత పటాస్, సుప్రీం, F2 చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నట్టు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాతో టాలీవుడ్ లేడీ ఫైర్ బ్రాండ్, ప్రస్తుత కాంగ్రెస్ మహిళా నాయకురాలు విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అవును, ఈ సినిమాలో విజయశాంతితోపాటు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషించనున్నట్టు సమాచారం. అయితే, దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 


ప్రస్తుతం మహేష్ బాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా వున్న అనిల్ రావిపూడి.. ఈ సినిమా కోసం రష్మిక మంధనను హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నట్టు టాక్.