హైదరాబాద్ : దర్శకుడు విక్రమ్ కుమార్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపుదిద్దుకొంటున్న కొత్త సినిమాలో అక్కినేని నాగచైతన్య నటించనున్నారు. ఈ సినిమాకు 'థాంక్యూ' (Thank you) అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాలని నిర్ణయించినప్పటికీ ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం కీర్తి సురేష్ నటించబోతున్న చిత్రాలు ’మిస్ ఇండియా, ’రంగ్ దే‘, ’ సర్కారు వారి పాట‘తో పాటు మరో సినిమా ఉంది. ఈ నేపథ్యంలో కీర్తి `థాంక్యూ`సినిమాలో నటించే పరిస్థితి కనబడటం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అన్ లాక్ 2: సడలింపులు ఇవే


కాగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి తేదీలను సర్దుబాటు చేయలేకపోతుందని, ఈ సినిమాలో కీర్తి నటించని పక్షంలో ప్రముఖ హీరోయిన్ సమంతను తీసుకోవాలని విక్రమ్ కుమార్ భావిస్తున్నారని సమాచారం. ఇదివరకే డైరెక్టర్ విక్రమ్ కుమార్ రూపొందించిన ’మనం‘, 24 సినిమాల్లో సమంత నటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ పూర్తిస్థాయిలో ఎత్తివేసిన తరువాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. జెనీలియా దంపతుల సంచలన నిర్ణయం..


జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!