హైదరాబాద్: మార్కెట్లో పల్సర్ బైక్స్ కు యువతలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే తాజాగా పల్సర్‌ 125 స్ప్లిట్ సీట్ వేరియంట్ పేరుతో గురువారం బజాజ్‌ ఆటో మార్కెట్లో విడుదల చేసింది. ఈ క్రేజీ బైక్‌ సింగిల్ సిట్‌ డ్రమ్‌ వేరియంట్‌ కలిగిన అత్యున్నత టెక్నాలజీతో రూపొందించామని, ఈ బైక్‌లో కొన్ని అదనపు ఫీచర్లు వినిమోగదారులను మరింతగా ఆకట్టుకుంటాయని సంస్థ పేర్కొంది. బైక్‌లో రెగ్యులర్‌ మోడల్‌ సింగిల్ యూనిట్‌కు బదులుగా స్పోర్టి బెల్లీ పాన్, స్పి‍ట్ గ్రాబ్ రైల్స్ వంటి కొన్ని అదనపు ఫీచర్లతో ఇది అలరించనుందని అన్నారు. కాగా పల్సర్‌ 125 బైక్‌ కలర్‌ బ్లాక్ సిల్వర్, బ్లాక్ రెడ్, నియాన్ గ్రీన్ కలర్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sushant Singh Rajput Death: Karan joharను Unfollow చేసిన లక్షల మంది నెటిజన్లు..


ఇదిలాఉంటే పల్సర్‌ 125 వేరియంట్‌ బైక్‌ ధర రూ.79,091గా సంస్థ నిర్ణయించింది. పల్సర్‌ 125 వేరియంట్‌ బైక్‌ను వినియోగదారులకు అందించడం పట్ల బజాజ్‌‌ ఆటో ప్రెసిడెంట్‌ సారంగ్‌ కనడే స్పందిస్తూ గత సంవత్సరం విడుదల చేసిన పల్సర్‌ 125 బైక్‌ కేవలం ఆరు నెలల్లోనే లక్ష బైకులను కస్టమర్లు కొనుగోలు చేశారని అన్నారు. స్పోర్ట్స్‌ బైక్‌ను ఇష్టపడే వారికి సరికొత్త టెక్నాలజీతో ఉండే ఈ బైక్ ప్రతి ఒక్కరిని‌ అలరిస్తుందని తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..