సాయిపల్లవి... ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. నటించిన ఫస్ట్ మూవీ' ఫిదా'లో తన నటనతో అన్నివర్గాల ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ ..అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది అభిమానులు సంపాదించింది. వాస్తవానికి సినిమా ఆఫర్లంటే చాలు..ఏమాత్రం ఆలోచించకుండా మంచి పారితోషికంగా ఇస్తే చాలు ఓకే చెప్పేస్తారు చాలా మంది యంగ్ హీరోయిన్స్. అయితే సాయిపల్లివి ఇందుకు భిన్నం.. కథ తనకి బాగా నచ్చితేనే ఆమె ఓకే చెబుతుంది. కథ నచ్చలేదు అంటే స్టార్ హీరో సినిమా..ప్రముఖ డైరెక్టర్ మూవీ అయినా సరే .. పారితోషికం ఎక్కువగా ఇస్తామన్నా ఆమె చేయదు. ఆమెలోని ఈ లక్షణమే ఆమెకి మరింత మంది అభిమానులను చేసిందంటున్నారు సినీ విశ్లేషకులు.


ఫిదా..ఎం.సి.ఎ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన స్టార్ డమ్ కౌవసం చేసుకున్న సాయిపల్లవి...తాజాగా కథ నచ్చని కారణంగా ఆమె ఒక దర్శకుడికి 'నో' చెప్పేసిందనే వినిపిస్తోంది. టాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. కల్యాణ్ రామ్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించారట. అయితే తన పాత్రకి తగినంతగా ప్రాధాన్యత లేదని భావించిన ఆమె మొహమాటం లేకుండా 'నో' చెప్పినట్లు టాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కానీ.. హీరోయిన్ సాయిపల్లవి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.