మహేష్ బాబు అభిమానుల దృష్టంతా ఆయన అప్‌కమింగ్ సినిమా ''సరిలేరు నీకెవ్వరు''పైనే ఉంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, పోస్టర్స్, పాటలు అభిమానుల్లో, ఆడియెన్స్‌లో అంచనాలు పెంచాయి. దీంతో ఇక అభిమానుల దృష్టి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పైకి షిఫ్ట్ అయింది. సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను మోసుకొచ్చే ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని సైతం అభిమానుల అంచనాలకు తగినట్టుగా భారీస్థాయిలో సెలబ్రేట్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంను వేదికగా ఎంచుకున్నట్టు తెలిపారు. జనవరి 5న సాయంత్రం 5.04 గంటలకు జరగనున్న సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ వేడుకలోనే సరిలేరు నీకెవ్వరు మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ కానుండటం మహేష్ బాబు ఫ్యాన్స్‌ని అంత సస్పెన్స్‌కి గురిచేయడానికి మరో కారణం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా సీనియర్ నటి విజయశాంతి, రష్మిక మంధన, ప్రకాష్ రాజ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ద్వారానే దాదాపు దశాబ్ధన్నరం తర్వాత విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.