బాలీవుడ్‌ హీరోలు షాహిద్ కపూర్‌, ఇషాన్ కట్టర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఈ నటుల అమ్మమ్మ ఖదిజా అజీమ్ మృతి చెందారు. హిందీ టీవీ, సినీ నటి నీలిమ అజీమ్ తల్లి ఖదిజా అజీమ్ గత కొంతకాలం నుంచి వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో  శనివారం ఖదిజా తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని దఢక్ ఫేమ్ ఇషాన్ కట్టర్ సోషల్ మీడియాలో తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమ్మమ్మ లేని లోటుపై ఇషాన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెటిజన్లను కదిలిస్తోంది. ‘అమ్మీ.. మీరు మా అందరికీ తెలివి, పట్టుదల, బుద్ధిని ఇచ్చారు. ఫ్రీడమ్ ఫైటర్, అనువాదకురాలు, ఎడిటర్, సోదరి, భార్య, అత్త, అమ్మమ్మ, స్నేహితురాలు ఇలా ఎన్నో రకాలుగా మాకు ఎంతో చేశావు. ఇతరులెవ్వరు నీ స్థానాన్ని భర్తీ చేయలేరు. నీవు నా జీవితంలో భాగమైనందుకు సంతోషంగా ఉన్నాను. ఎవరి జీవితాలపై నీ ప్రభావం ఉందో వారు ఎన్నటికీ నిన్ను మరిచిపోలేరంటూ’ యంగ్ హీరో ఇషాన్ కట్టర్ భావోద్వేగంతో చేసిన పోస్ట్ నెటిజన్లను మనసు దోచుకుంది.



తెలుగులో సక్సెస్ అయిన అర్జున్ రెడ్డి బాలీవుడ్‌ రీమేక్ కబీర్ సింగ్‌తో షాహిద్ కపూర్ విజయాన్ని అందుకున్నాడు. మరో తెలుగు మూవీ జెర్సీ రీమేక్ పనులతో బిజీగా ఉన్నాడు షాహిద్. అతడి సోదరుడు ఇషాన్ కట్టర్ సైతం తెలుగు సినిమా బాలీవుడ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మూవీ టాక్సీవాల బాలీవుడ్ రీమేక్ ‘ఖాలీ పీలీ’తో ఇషాన్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..