డెత్ సర్టిఫికేట్ రిపోర్టుతో శ్రీదేవి కేసు దర్యాప్తు ముందుకు కదులుతున్న విషయం తెలిసిందే. అప్పటి వరకు గుండెపోటుతో మరణించారని భావిస్తువచ్చాం.. డెత్ సర్టిఫికేట్ రిపోర్టులో ఆమె ప్రమాద వశాస్తూ ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో పడి మృతి చెందరాని పేర్కొనడంతో ఈ కేసు మలుపు తిరిగింది. ఈ రిపోస్టు  ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వచ్చింది డెత్ సర్టిఫికేట్ కు సంబంధించిన ప్రాధమిక సమచారం మాత్రమే. పూర్తి స్థాయిలో రిపోర్టు వస్తే కానీ దుబాయ్ పోలీసులు ఓ అంచనాకు రాలేని పరిస్థితి. దీంతో శ్రీదేవీ డెత్ సర్టిఫికేట్ పూర్తి స్థాయి రిపోర్టు పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.