శ్రీదేవి డెత్ సరిఫికెట్ లో ఆమె ప్రమాదవశాత్తు బాత్ రూంలో పడి చనిపోయిందని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు ఆమె గుండెపోటుతో మరణించిందని భావించారు..అయితే తాజా నివేదికతో శ్రీదేవి మరణంపై కొత్త ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. డెత్ రిపోర్టుతో ఈ కేసును మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీదేవి గుండెపోటుతో మరిణించిందని ఎందుకు చెప్పినట్లు..?  ఆమె బాత్ రూం వాష్ టబ్ లో ప్రమాదవశాత్తు పడిపోయిందా..? లేదంటే ఎవరైనా తోశారా ? లేదంటే మద్యం మత్తులో జరిగిందా అనే ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమౌతున్నాయి. 


ఇలా శ్రీదేవి మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్న నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం ఈ కేసును దర్యాప్తు చేసేందుకు దూబాయ్ పబ్లిక్ ప్రాసెక్యూషన్‌కు బదిలీ చేసింది. ఇలా అనేక అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో   శ్రీదేవి భౌతికకాయం అప్పగింతలో మరింత జాప్యం జరిగినట్లు తెలిసింది.