Bus falls off bridge in MP's Khargone: మధ్యప్రదేశ్‌లో ఘోర  ప్రమాదం చోటుచేసుకుంది. ఖర్గోన్ జిల్లాలో ఇండోర్‌కు వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి పడిపోవడంతో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు, క్షతగాత్రులకు రూ.25 వేలు ప్రకటించింది. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని అధికారులు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాద సమయంలో బస్సులో 70-80 మంది ప్యాసింజర్స్ ఉన్నట్లు సమాచారం. డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి పడినట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 


మరోవైపు ఓ బస్సు ముంబైలోని పశ్చిమ శివారు అంధేరీలోని ఒక దుకాణంపైకి దూసుకెళ్లింది. అంధేరి (తూర్పు)లోని మహంకాళి రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల వాహనం దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, దుకాణానికి కొంత నష్టం వాటిల్లింది. డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 


Also read: TN board exam: ప్లస్‌ టూ ఫలితాల్లో కార్పెంటర్ కూతురు సంచలనం.. 600కు 600 మార్కులు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook