బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. 9 రోజుల పసికందును ఆస్పత్రిలో ఎలుకలు కొరికి చంపిన కేసు ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ధర్బంగలోని మెడికల్ కాలేజీలో చిన్నారులకు అత్యవసర వైద్యం అందించే విభాగం(NICU)లో చికిత్స పొందుతున్న తమ చిన్నారిని అక్టోబర్ 29న ఎలుకలు కొరికి చంపేశాయని తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే, చిన్నారి తల్లిదండ్రుల ఆందోళనపై మెడికల్ కాలేజీ యాజమాన్యం మాత్రం మరోలా స్పందించింది. తమ మెడికల్ కాలేజీలో ఎలుకల బెడదే లేకపోగా.. అసలు అటువంటి ఘటన జరిగినట్టే తనకు తెలియదని, చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కనుక విచారణ చేయిస్తామని డా. ఓం ప్రకాశ్ తెలిపారు.