కరోనా మహమ్మారితో అష్టకష్టాలు పడుతున్న మహారాష్ట్రలో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనా కాటుకు ఓ నిండు గర్భిణి బలైపోయింది. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఏడు కరోనా మరణాలు సంభవించాయని వైద్యశాఖ వెల్లడించింది. ఇందులో ఓ గర్భిణి(30) కూడా ఉన్నారు. ముంబైలోని నల్లసోపారా ప్రాంతానికి చెందిన ఓ మహిళ 9 నెలల గర్భవతి.  కరోనాను జయించిన 10 నెలల బుడ్డోడు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం ఆమెకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. అదే రోజు రాత్రి (ఏప్రిల్ 4న) ఆ మహిళను బీవైఎల్ నాయర్ ఆస్పత్రికి కుటుంసభ్యులు తీసుకొచ్చారు. లక్షణాలు చూసి కరోనా అయి ఉండొచ్చునని డాక్టర్లు భావించారు. ఐసోలేషన్ వార్డుకు కూడా తరలించి చికిత్స ప్రారంభించారు. అయితే అప్పటికే గర్భిణి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచిందని డాక్టర్లు తెలిపారు. సన్నీ లియోన్ లేటెస్ట్ బికినీ ఫొటోలు


ఆమెకు నిర్వహించిన కోవిడ్19 టెస్టుల ఫలితాలు సోమవారం వచ్చాయి. గర్భిణీకి కరోనా ఉన్నట్లు తేలింది. దీనిపై బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. తొలుత రెండు ఆసుపత్రులకు వెళ్లగా అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించారని కన్నీటి పర్యంతమయ్యారు. నాయర్ ఆస్పత్రి వైద్యులు అడ్మిట్ చేసుకుని చికిత్స ప్రారంభించినా అప్పటికే పరిస్థితి చేజారిపోవడంతో ఆమె కన్నుమూసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photos