కర్నాటక అసెంబ్లీకి బాగేపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ నటుడు సాయికుమార్ వెనుకంజలో ఉన్నారు. స్థానిక అంశం ఆయనకు ప్రతికూలంగా పరిణమించిందని చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన సుబ్బారెడ్డి 2600 ఓట్ల మెజారిటీతో ప్రథమ స్థానంలో ఉండగా రెండో స్థానంలో జేడీఎస్ అభ్యర్ధి మనోహర్ ఉన్నారు. అలాగే సీపీఎం అభ్యర్ధిగా పోటీలోకి దిగిన శ్రీరామిరెడ్డికి మూడో స్థానంలో ఉండగా బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న సాయికుమార్ నాలుగో స్థానంలో ఉండడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాగేపల్లి అనేది ఒక అసెంబ్లీ నియోజకవర్గం. ఇది చిక్కబల్లాపూర్ జిల్లా మరియు కర్నాటకలోని దక్షిణ కర్ణాటక ప్రాంతంలో ఉంది. ఇది చిక్కబల్లాపూర్ పార్లమెంటరీ / లోక్సభ నియోజకవర్గంలో భాగం.


మొత్తం ఓటర్లు 1,94,781. 97,085 మంది పురుషులు, 97,655 మంది మహిళలు, ఇతరులు 24 మంది ఉన్నారు.  లింగ నిష్పత్తి 100.57 కాగా అక్షరాస్యత  63 శాతంగా ఉంది.


జేడీఎస్ తరఫున డా. సీఆర్ మనోహర్, కాంగ్రెస్ తరఫున ఎస్ఎన్ సుబ్బారెడ్డి, సీపీఎం తరఫున జేవీస్ శ్రీరామరెడ్డి బరిలో ఉన్నారు.