ఆర్మీ డే రిహార్సల్స్‌లో అపశృతి చోటుచేసుకుంది. జనవరి 15న నిర్వహించనున్న ఆర్మీ డే వేడుకల్లో ఆర్మీ సైనికులు ప్రదర్శించనున్న విన్యాసాల కోసం జరుగుతున్న రిహార్సల్స్‌లో భాగంగా హెలీక్యాప్టర్ నుంచి తాడు సహాయంతో కిందకు దిగుతుండగా ముగ్గురు సైనికులు ఎత్తు నుంచి కిందపడిపోయారు. గాల్లో ఎగురుతున్న హెలీక్యాప్టర్ నుంచి కిందకు దిగుతున్న సమయంలోనే అకస్మాత్తుగా తాడు తెగిపోయింది. దీంతో కింద వున్న మైదానంలోకి దిగుతున్న సైనికులు అమాంతం కిందపడిపోయారు. కిందపడిన ముగ్గురు జవాన్లను హుటాహుటిన మిలిటరీ ఆస్పత్రికి తరలించారు అక్కడే వున్న ఆర్మీ అధికారులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు జవాన్లు ప్రస్తుతం మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ప్రాణానికి ఎటువంటి హానీ లేదని తెలుస్తోంది. జరిగిన ఘటనపై ఆర్మీ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఉదంతం గురువారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.