న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల్లో అమరుడైన ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే తన శాపం వల్లే చనిపోయారని భోపాల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపి అభ్యర్థిగా పోటీచేస్తోన్న సాధ్వీ ప్రగ్యా సింగ్ థాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం స్పందించింది. సాధ్వీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం అని చెప్పిన బీజేపి.. ఆమె అనుభవించిన మానసిక క్షోభ ఆమె చేత అలా మాట్లాడించి ఉంటుందని అభిప్రాయపడింది. 


హేమంత్ కర్కరేను దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఒక అమరుడిగానే భారతీయ జనతా పార్టీ భావిస్తుందని ఈ సందర్భంగా బీజేపి వివరణ ఇచ్చింది.