Kamal Haasan says Govt should listen to the farmers demands: చెన్నై‌: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని (Farm Bills) గత ఆరు రోజుల నుంచి పలు రైతు సంఘాలు (Delhi Chalo) ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళ‌నలపై మ‌క్క‌ల్ నీధి మ‌యిం (Makkal Needhi Maiam ) అధ్య‌క్షుడు, నటుడు క‌మ‌ల్ హాస‌న్ ( Kamal Haasan ) స్పందించారు. కేంద్ర ప్ర‌భుత్వం (Central Govt) రైతులు డిమాండ్ల‌ను వినాలని కమల్ హాసన్ సూచించారు. వారి డిమాండ్లను పట్టించుకోవాలని కేంద్రానికి ఆయన విన్నవించారు. ఈ మేరకు కమల్ హాసన్ మంగళవారం తమిళనాడులోని చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త‌మిళ‌నాడులో సీఎం పరిపాల‌న ప‌ట్ల సంతృప్తి లేద‌ని పేర్కొన్నారు. నివ‌ర్ తుఫాన్ బాధితుల‌కు స‌హాయం చేయడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వ తీరును ఆయ‌న ఖండించారు. Also read: Delhi Chalo: కొనసాగుతున్న రైతుల ఆందోళన.. నేడు కేంద్రంతో సమావేశం


ఈ సమావేశంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీస‌ర్ సంతోష్ బాబు మ‌క్క‌ల్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన్ను కమల్ మక్కల్ నీధి మయం పార్టీలోకి ఆహ్వానించారు. 


 


Also Read | GHMC App లో పోలింగ్ సెంటర్, బూత్ వివరాలు సులభంగా తెలుసుకోండి!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook