ప్రసారమాధ్యమాల వార్తల్లో దళితులు అనే పదాన్ని వాడకూడదని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 'దళితులు' అనే పదానికి బదులుగా షెడ్యూల్డ్ క్యాస్ట్ అని వాడాలని సూచించింది. 'బాంబే హైకోర్టు సూచనలు, రాష్ట్రపతి ఆదేశాల మేరకు అన్ని భాషల్లో దళితులకు బదులుగా రాజ్యాంగబద్ధమైన షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ అనే పదాన్ని వాడాలని కోరుతున్నాం' అని కేంద్రం వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘‘భారతదేశ రాజ్యాంగంలోని అధికరణ 341 ప్రకారం జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో నోటిఫై చేసిన షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తుల గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు .. అన్ని అధికారిక లావాదేవీలు, వివాదాలు, వ్యవహారాలు, ధ్రువపత్రాలు మొదలైనవాటిలో, ఇంగ్లిష్‌లో అయితే ‘షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌’ అని, లేదా దానికి సమానార్థకమైన ప్రాంతీయ భాషల్లోని పదాలను గానీ మాత్రమే వాడాలని అన్ని మీడియా సంస్థలకు కోరుతున్నాం’’ అని పేర్కొంటూ కేంద్ర కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలో కానీ, ఏదైనా చట్టంలో కానీ ‘దళితులు’ అనే పదం లేదని  తెలిపిందని పేర్కొంది.


ఈ అంశంపై భారత ప్రెస్ కౌన్సిల్ (పీసీఐ)ను ఐ&బి మంత్రిత్వ శాఖ ప్రశ్నించనుంది. ఈ నెల చివర్లో పీసీఐ దీనిపై స్పందిస్తుందని నివేదికలు తెలిపాయి.


నరేంద్రమోదీ ప్రభుత్వం ఇటీవలే ఇలాంటి ఉత్తర్వులను మార్చి- ఏప్రిల్‌లో జారీ చేసింది. అధికారిక వ్యవహారాల్లో, లావాదేవీల్లో షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వారి గురించి ప్రస్తావించాల్సినప్పుడు రాజ్యంగంలో పేర్కొనబడని ‘దళిత్/దళితులు' అనే పదాన్ని ఉపయోగించవద్దని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.