ప్రియుడి మోజులో పడి.. భర్తను, పిల్లలను చంపాలనుకుంది ఓ మహిళ. అయితే, భర్తను చంపడం కుదరక.. తన ఇద్దరు పిల్లలను చంపేసింది. ఈ ఘటన చెన్నైలో వెలుగుచూసింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. కుండ్రత్తూర్‌కి చెందిన ప్రవేట్ బ్యాంక్‌ ఉద్యోగి విజయ్‌(30), అభిరామి(25) దంపతులకు అజయ్‌(7) అనే కుమారుడు, కారుణ్య(5) అనే కుమార్తె ఉన్నారు. అదే ప్రాంతంలోని ఓ బిర్యానీ దుకాణంలో పనిచేస్తున్న సుందరం అనే యువకుడితో అభిరామికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయం విజయ్‌కి తెలియడంతో గొడవలు చెలరేగాయి.  చివరికి ప్రియుడితో పారిపోయేందుకు పిల్లలకు విషం కలిపిన పాలను తాగిచ్చి హతమార్చింది.


బ్యాంకు నుండి తిరిగొచ్చిన విజయ్ ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఇద్దరు పిల్లలూ నురుగులు కక్కుకొని అచేతనంగా పడి ఉన్నారు. భోరున విలపిస్తూ... భార్య కోసం వెతకగా, ఆమె కనిపించకపోవడంతో కుండ్రత్తూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సుందరంను పట్టుకోవడంతో అసలు విషయం చెప్పగా.. అభిరామిని కోసం గాలిస్తున్నారు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.