Nitin Gadkari: కరోనా మహమ్మారి ప్రతాపం రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశంలో ఓ వైపు భారీగా కేసులు నమోదవుతుంటే..మరోవైపు వీఐపీలు, సెలెబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో గత 24 గంటల్లో దాదాపు 2 లక్షల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా దేశంలోని సెలెబ్రిటీలు, వీఐపీలు, ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో చాలామంది ప్రముఖులకు కరోనా వైరస్ సోకింది. నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)కరోనా బారిన పడగా..ఇవాళ మరో ముఖ్య బీజేపీ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారిన పడ్డారు. 


తనకు కరోనా సోకిందనే విషయాన్ని నితిన్ గడ్కరీ (Nitin Gadkari ) స్వయంగా ట్వీట్ చేసి చెప్పారు. తనతో కాంటాక్ట్‌లో వచ్చిన వారంతా పరీక్ష చేయించుకోవడమే కాకుండా ఐసోలేట్ అవ్వాలని విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వెంటనే ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో వెళ్లిపోయారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకు స్వల్ప లక్షణాలున్నాయి. అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ..ఐసోలేట్ అయ్యానని వెల్లడించారు.



Also read: Supreme Court: ఇంటి కోసం డబ్బులు డిమాండ్ చేసినా..వరకట్న వేధింపే, సుప్రీంకోర్టు సంచలన తీర్పు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి