India Covid: దేశంలో రోజువారీ కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 3805 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 20 వేల 303కు చేరింది. అంతకుముందు దేశంలో 3 వేల 545 కేసులు రికార్డు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల శాతం 0.05 శాతం, రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. అటు గడిచిన 24 గంటల్లో 3168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4 కోట్ల 25 లక్షల 54 వేల 416 కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.78 శాతం, వీక్లీ  పాజిటివిటీ రేటు 0.79 శాతంగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఇప్పటివరకు 84 కోట్ల 3 లక్షల మంది కరోనా పరీక్షలు చేశారు.గడిచిన 24 గంటల్లో 4 లక్షల 87 వేల 544 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపారు. ఇందులో కొత్తగా 3805 కేసులు వెలుగులోకి వచ్చాయి.  మరోవైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకు 190 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.


ఇక తెలంగాణలో నిన్న సాయంత్రం వరకు కొత్తగా 62 కేసులు నమోదుకాగా.. 30 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.43 శాతంగా ఉంది.


Also Read: Madhya Pradesh Fire Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం... ఏడుగురు సజీవ దహనం...


Also Read: Shani Dev Remedies: శనిదేవున్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పనులు చేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.