India Corona Outbreak: కరోనా వైరస్ విలయతాండవం ఆగడం లేదు. ఇండియాలో రోజురోజుకూ పరిస్థితి ఘోరంగా మారుతోంది. రాష్ట్రాల్లో లౌక్‌డౌన్, కర్ఫ్యూ వంటివాటితో సంక్రమణ ఆగడం లేదు. తాజాగా ఇప్పటివరకూ లేనంతగా భారీ కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ సెకండ్ వేవ్(Corona Second Wave) ధాటికి భారతదేశం అల్లకల్లోలమవుతోంది. దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ఒక్కొక్కటిగా రాష్ట్రాలు లాక్‌డౌన్(Lockdown)బాట పడుతున్నాయి. ఇప్పటికే దేశంలో 5 రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉండగా..మిగిలిన కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్‌డౌన్, కర్ఫ్యూ అమల్లో ఉన్నాయి. అయినా ఇప్పటికే దేశంలో పరిస్థితి అదుపు తప్పిన కారణంగా సంక్రమణ ఆగడం లేదు. నిన్నటి వరకూ రోజుకు 3.5 లక్షలకు పైగా కేసులు నమోదైన పరిస్థితి.


గత 24 గంటల్లో అయితే ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయింది.తీవ్ర ఆందోళన కల్గించే స్థాయిలో ఏకంగా 4 లక్షల 8 వేల 323 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19 లక్షల 45 వేల 299 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇండియాలో కరోనా సంక్రమణ ప్రారంభమయ్యాక ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే. దేశంలో ఇప్పటివరకూ పాజిటివ్ రోగుల సంఖ్య 1 కోటి 91 లక్షల 63 వేల 488కు చేరుకుంది.


Also read: COVID-19 test నకిలీ రిపోర్ట్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook