దేశంలో కరోనా వైరస్(CoronaVirus) రోజురోజుకూ విజృంభిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 17,296 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా ఒకరోజు నమోదైన కేసుల్లో దేశంలో ఇప్పటివరకూ ఇదే అత్యధికం కావడం విచారకరం. భారత్ VS చైనా.. పెద్దన్న అమెరికా కీలక ప్రకటన


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సమయంలో 407 కరోనా మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి దేశంలో ఇప్పటివరకూ కోవిడ్ బారినపడి 15,301 మంది చనిపోయారు. దేశంలో మొత్తం 4,90,401 కేసులు(India COVID19 Cases) నమోదు కాగా, అందులో చికిత్స అనంతరం 2,85,637 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,89,463 మంది చికిత్స పొందుతున్నారు.  హైదరాబాద్‌లో దారుణం.. బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం


శుక్రవారం ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ