Coronavirus updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి 50వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా నిత్యం పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో శుక్రవారం ( నవంబరు 20న ) దేశ వ్యాప్తంగా కొత్తగా.. 46,232 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 564 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,50,598 కి చేరగా.. మరణాల సంఖ్య 1,32,726 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే నిన్న కరోనా నుంచి 49,715 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 84,78,124 కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 4,39,747 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 93.60 శాతం ఉండగా.. మరణాల రేటు 1.47 శాతం ఉంది. Also read: Covid-19: ఢిల్లీలో మళ్లీ వంద దాటిన కరోనా మరణాలు


ఇదిలాఉంటే.. శుక్రవారం దేశవ్యాప్తంగా 10,66,022 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 20వ తేదీ వరకు దేశంలో మొత్తం 13,06,57,808 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఎసీఎంఆర్ వెల్లడించింది. Also raed: Uttar Pradesh: కల్తీ మద్యం తాగి నలుగురు మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి