Coronavirus updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో 50వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు నిత్యం పెరుగుతున్న రికవరీల సంఖ్య నిన్న తగ్గింది. గత 24 గంటల్లో బుధవారం ( నవంబరు 25న ) దేశ వ్యాప్తంగా కొత్తగా.. 44,489 కరోనావైరస్ (Coronavirus) కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 524 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 92,66,706 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,35,223 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే నిన్న ఈ మహమ్మారి నుంచి 36,367 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 86,79,138 కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 4,52,344 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 93.66 శాతం ఉండగా.. మరణాల రేటు 1.46 శాతం ఉంది. Also read: CM KCR: తెలంగాణలో మత విద్వేశాలకు కుట్ర: సీఎం కేసీఆర్


ఇదిలాఉంటే.. బుధవారం దేశవ్యాప్తంగా 10,90,238 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 25వ తేదీ వరకు దేశంలో మొత్తం 13,59,31,545 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఎసీఎంఆర్ వెల్లడించింది. Also read: Nivar Cyclone updates: తీరం దాటిన ‘నివర్’


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G 


 Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి