India Coronavirus Cases Updates | న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతకొన్ని రోజులతో పోల్చుకుంటే.. దేశంలో కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా మరోసారి 20వేలకు తక్కువగా నమోదయ్యాయి. శనివారం (డిసెంబరు 26న) దేశంలో కొత్తగా 18,732 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 279 మంది మరణించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,87,850 కి చేరగా.. మరణాల సంఖ్య 1,47,622 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also Read: Telangana: ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్య


ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. (Coronavirus) కేసులతోపాటు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం పెరుగుతోంది. నిన్న కరోనా నుంచి 21,430 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 97,61,538 కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో (active cases) 2,78,690 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.


Also read: Corona Second Wave In Telangana: కరోనా సెకండ్ వేవ్.. జర జాగ్రత్త!: ఈటల రాజేందర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook