భారత్‌లో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ తీవ్రం అవుతోంది. ఓవైపు రికవరీ కేసులు మెరుగవుతుంటే.. మరోవైపు కరోనా మరణాలు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా 52వేలకు పైగా కరోనా కేసులను నిర్ధారించారు. నిన్న ఒక్కరోజే 52,972 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి భారత్‌లో ఇప్పటివరకూ మొత్తం కరోనా బాధితుల సంఖ్య (COVID19 Positive cases in India) 18,03,696 (18 లక్షలు)కు చేరింది. COVID19 వ్యాక్సిన్‌లో మరో ముందడుగు


నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 771 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ భారత్‌లో మొత్తం కోవిడ్19 మరణాలు 38,135కు చేరుకున్నాయి. అయితే మొత్తం కేసులకుగానూ 11లక్షలకు పైగా బాధితులు కరోనా మహమ్మారిని జయించడం గమనార్హం. భారత్‌లో చికిత్స అనంతరం 11,86,203 మంది కరోనా వైరస్ నుంచి కోలుకోగా, ప్రస్తుతం 5,79,357 యాక్టివ్ కేసులున్నాయి. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే.. 
 
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్