Covaxin Trials on Children: కరోనా మహమ్మారి కట్డడి కోసం దేశవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. థర్డ్‌వేవ్ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్ ట్రయల్స్‌ను చిన్నారులపై ప్రారంభించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఇప్పుడిప్పుడే దేశంలో అదుపులోకొస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ అదుపులో రాకముందే థర్డ్‌వేవ్ (Corona Third Wave) ప్రకంపనలు రేపుతోంది. థర్డ్‌వేవ్ ప్రభావం చిన్నారులపై ఎక్కువగా ఉంటుందనే శాస్త్రవేత్తల హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ నేపద్యంలో కోవాగ్జిన్ ట్రయల్స్‌ను(Covaxin trials on Children) చిన్నారులపై ప్రారంభించారు. పట్నా ఎయిమ్స్ ఆసుపత్రిలో 70-80 మంది చిన్నారులపై కోవాగ్జిన్(Covaxin) ట్రయల్స్ చేయనున్నారు. వ్యాక్సిన్ ఇచ్చేముందు చిన్నారులకు ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ పరీక్షల్ని చేస్తున్నారు. పరీక్షల్లో నెగెటివ్ వచ్చినవారిపైనే ట్రయల్స్ జరుపుతున్నారు. 


మరోవైపు చిన్నారుల ఆరోగ్య పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. రెండేళ్ల ుంచి 18 ఏళ్ల వయస్సు చిన్నారులపై ట్రయల్స్ నిర్వహించేందుకు డీసీజీఐ (DCGI) అనుమతిచ్చింది. ట్రయల్స్‌లో పాల్గొనే చిన్నారులకు ట్రావెల్ అలవెన్స్‌గా వేయి రూపాయలు ఇస్తున్నట్టు పట్నా ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ట్రయల్స్‌లో సత్ఫలితాలు వస్తే..ఇక చిన్నారులకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.


Also read: Ramdev Baba: రాందేవ్ బాబాకు సమన్లు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook