కులూ: హిమాచల్ ప్రదేశ్‌లో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 44కి చేరింది. కులూ జిల్లాలో అదుపుతప్పిన ఓ బస్సు రోడ్డు పక్కనే వున్న లోతైన లోయలో పడిన ఘటన తెలిసిందే. గురువారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో తొలుత 20 మంది చనిపోయినట్టుగా వార్తలు వెలువడినప్పటికీ.. రాత్రి సమయానికి మృతుల సంఖ్య 44కి చేరింది. కులూ జిల్లాలోని బంజర్ నుంచి గదగుశానికి వస్తుండగా బంజర్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.