Delhi Lockdown: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో లాక్‌డౌన్ మరోసారి పొడిగించారు. కరోనా నియంత్రణకు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి కొనసాగుతోంది. వరుసగా నాలుగవ రోజు కూడా రికార్డు స్థాయిలో 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అటు రాజధాని ఢిల్లీలో సైతం కేసుల సంఖ్య తగ్గలేదు. తాజాగా 61 వేల 552 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 13 వేల 336 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు నిన్న ఒక్కరోజే 3 వందల మంది మరణించారు. ఇప్పటి వరకూ కోవిడ్ కారణంగా 19 వేల 344 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గి..86 వేలకు చేరుకున్నాయి. కోవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉన్న 52 వేలమంది కోలుకున్నారు. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 13 లక్షల 23 వేల 567కు చేరుకుంది.


దేశ రాజధానిలో కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించారు. మే 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఈసారి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామన్నారు. మెట్రో సర్వీసులను కూడా రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. పలు వర్గాలకు చెందిన వారితో చర్చించిన అనంతరం లాక్‌డౌన్ పొడిగింపు(Lockdown Extension)పై నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ దేశంలో 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లో ఉంది.


Also read: Covid19 Variant: ఇండియాలో పెను విపత్తుకు కారణం ఆ వేరియంట్‌నే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook