న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు((Petrol and Diesel Price Today) అమాంతం పెరిగిపోతున్నాయి. వరుసగా 21 రోజులుగా పెరిగిన పెట్రో ధరలలో ఆదివారం కాస్త ఉప శమనం లభించింది. గత మూడు వారాలుగా ప్రతిరోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల ఆదివారం స్థిరంగా కొనసాగుతన్నాయి. ఏపీలో భారీగా కరోనా కేసులు.. తాజాగా 12 మంది మృతి


ఆయిల్ కంపెనీలు, ముడి చమురు సంస్థలు వాహనదారులకు ఆదివారం స్వల్ప ఊరట కలిగించాయి.  దీంతో పెట్రోల్​, డీజిల్​ ధరల(Petrol Price Today In Delhi) మోతకు ఈ ఒక్కరోజు బ్రేక్​పడింది. జూన్​ 27న ఢిల్లీలో లీటర్​ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 21 పైసలు పెరగడంతో వరుసగా ధరలు రూ. 80.38, లీటరు డీజిల్​ రూ. 80.40గా ఉన్నాయి. ఆదివారం అదే ధరల వద్ద పెట్రోలు, డీజిల్ ధరలు కొనసాగుతున్నాయి.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ