Noida Firecrackers Explosion: నొయిడాలో జగన్నాథ్ శోభాయాత్రలో విషాదం చోటుచేసుకుంది. దాద్రి-గ్రేటర్ నొయిదా మార్గంలో జగన్నాథ్ శోభాయాత్ర జరుగుతుండగా.. అక్కడే ఉన్న ఈ-రిక్షాలో నింపి ఉన్న ఫైర్ క్రాకర్స్‌కి నిప్పంటుకుని భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జగన్నాథ్ శోభాయాత్ర జరుగుతుండగా జరిగిన పేలుడు కావడంతో ఘటనా స్థలంలో భయానక వాతావరణం ఏర్పడింది. ఉన్నట్టుండి పేలుడు సంభవించడంతో అక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక జగన్నాథ్ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు పరుగులుతీశారు. 



 


ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోను చూస్తే.. పేలుడు తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఈ పేలుడు అనంతరం భయంకరంగా మారింది


ఇది కూడా చదవండి : CBSE Board Exams 2023: సీబీఎస్ఈ ఎగ్జామ్స్ పేపర్ లీక్ వివాదంపై స్పందించిన బోర్డు


ఇది కూడా చదవండి : 7th pay Commission News: 7వ పే కమిషన్ అమలు చేయకపోతే నిరవధిక ధర్నా.. ఉద్యోగ సంఘాల వార్నింగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook