Delhi Earthquake: న్యూ ఢిల్లీ: ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు రాజధానిని ఆనుకుని ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ( NCR ), గురుగ్రామ్‌లో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 4.7 గా ( Magnitude of 4.7 ) నమోదైంది. 3-4 సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్న వారు భయంతో బయటకు పరుగులుతీశారు. భూకంపం కేంద్రం ఎక్కడ ఉందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఢిల్లీతో పాటు ఢిల్లీకి సమీప ప్రాంతాల్లో తరచుగా సంభవిస్తున్న భూకంపాలు అక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : PM Modi Visits Leh: లేహ్‌లో ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటన


జాతీయ భూకంపం అధ్యయన కేంద్రం ( NCS ) వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లీతో పాటు నగరానికి సమీపంలోని పరిసర ప్రాంతాల్లో 4వ సైస్మిక్ జోన్ పరిధిలోకి వస్తాయి.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..