బాలీవుడ్ సినీనటుడు, పంజాబ్‌లోని గుర్దాస్‌పూర్ లోక్ సభ నియోజకవర్గం బీజేపి అభ్యర్థి సన్నిడియోల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం కోసం విధించిన సమయం ముగిసిన అనంతరం కూడా సన్నిడియోల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడాన్ని తప్పుపట్టిన ఎన్నికల సంఘం.. ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించిన నేరం కింద వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. శనివారం ఉదయం 9 గంటలలోపే వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. 


సన్నిడియోల్‌కు శుక్రవారం రాత్రే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఈ నోటీసులు అందించారు.