Encounter: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో లష్కర్ ఎ తోయిబా కమాండర్ హతమయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జమ్ముకశ్మీర్‌లో భధ్రతాబలగాలకు భారీ సాఫల్యం లభించింది. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా(Pulwama)టౌన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.పుల్వామాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంలో కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు కలిసి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్బంగా కూంబింగ్ చేస్తున్న సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. లొంగిపోవల్సిందిగా కశ్మీర్ పోలీసులు హెచ్చరించినా వినకుండా ఉగ్రవాదులు..భద్రతాబలగాలపై కాల్పులు జరిపారు. దాంతో భద్రతాబలగాలు కూడా ఎదురుకాల్పులు జరపగా..ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో లష్కరే తోయిబా(Lashkar e Toiba)కమాండర్ ఐజాజ్ ఉన్నాడని కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు స్థానికులని..ఏ సంస్థకు చెందినవారనేది ఇంకా తెలియదని చెప్పారు. ఈ ఎన్,‌కౌంటర్(Encounter)ద్వారా భద్రతాబలగాలకు భారీ సాఫల్యం లభించినట్టైంది. 


Also read: Pharma Pricing: తగ్గనున్న వైద్య పరికరాల ధరలు, ఎన్‌పీపీఏ కీలక నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook