బొగ్గు గనుల కేటాయింపులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాను దోషిగా ప్రత్యేక సిబిఐ కోర్టు గుర్తించింది. మాజీ బొగ్గు కార్యదర్శి హెచ్సీ గుప్తా, మాజీ జార్ఖండ్ ముఖ్య కార్యదర్శి అశోక్ కుమార్ బసు కూడా కోర్టు దోషులుగా గుర్తించింది. ఖైదీల తీర్పుపై వాదనలు గురువారం జరుగుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోల్కతాకు చెందిన వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ (విఐఎస్యుఎల్) కు జార్ఖండ్ లోని రాజాహారా నార్త్ బొగ్గు బ్లాక్ అప్పగించారు. ఈ కేటాయింపులో అక్రమాలు జరిగాయని కేసు దాఖలైంది. 


కోడా, గుప్తా, సంస్థతోపాటు నిందితులుగా మాజీ జార్ఖండ్ చీఫ్ సెక్రటరీ ఎ.కె. బసు, బసెంట్ కుమార్ భట్టాచార్య, బిపిన్ బీహారీ సింగ్, విశాల్ డైరెక్టర్ వైభవ్ తుల్సైయాన్, కొడాకు చెందిన సహాయకుడు విజయ్ జోషి, చార్టర్డ్ అకౌంటెంట్ నవిన్ కుమార్ తుల్సైయాన్ లు ఉన్నారు. 


జనవరి 8, 2007 న రాజాహార్ నార్త్ బొగ్గు బ్లాక్ కేటాయింపుల కోసం సంస్థ దరఖాస్తు చేసుకుందని సిబిఐ ఆరోపించింది.


బొగ్గు క్షేత్రాల కేటాయింపు కోసం విస్యూల్ కేసును జార్ఖండ్ ప్రభుత్వం, స్టీల్ మంత్రిత్వ శాఖ సిఫార్సు చేయకపోయినా..  36వ స్క్రీనింగ్ కమిటీ ఈ సంస్థకి  బ్లాక్ ను సిఫార్సు చేసింది.


స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా  ఉన్న గుప్తా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు, బొగ్గు మంత్రిత్వ శాఖకు వాస్తవాలను దాచిపెట్టాడని ఆరోపించారు. బొగ్గు బ్లాకు కేటాయింపు కోసం జార్ఖండ్ 'విఐఎస్యూఎల్' ను సిఫార్సు చేయలేదని సిబిఐ వెల్లడించింది. 


కోడా, బసు మరియు నిందితులుగా ఉన్న ఇద్దరు గవర్నమెంట్ అధికారులు బొగ్గు గనుల కేటాయింపులో విఐఎస్యూఎల్ అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించింది సిబిఐ. నిందితులు వారిపై ఉన్న ఆరోపణలను ఖండించారు.