Farmer protests: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన ( Farmer Agitation ) చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు పడుతున్న కష్టాలను చూసి తట్టుకోలేక సంత్‌ రామ్‌సింగ్‌ (65) అనే సిక్కు మతగురువు తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన సంత్ రామ్‌సింగ్ ( Sant Ram Singh ) బుధవారం సింఘు బోర్డర్‌ (Singhu border) కు సమీపంలోని కుండ్లీ దగ్గర తన కారులో తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు. అక్కడకు చేరుకున్న పోలీసులు పంజాబీ భాషలో ఆయన రాసిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూసైడ్ నోట్‌లో రామ్‌సింగ్ ఇలా రాశారు.. 
‘హక్కుల కోసం రైతులు చేస్తున్న ఉద్యమంలో వారు పడుతున్న కష్టాలు చూసి ఎంతో బాధ కలుగుతుంది. ప్రభుత్వం వారికి న్యాయం చేయడం లేదు. అన్యాయం చేయడం పాపం. అన్యాయాన్ని సహించడం కూడా పాపమే. రైతులకు మద్దతుగా కొందరు తమ అవార్డులను ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చారు. నేను రైతులకు సంఘీభావంగా.. అణిచివేతకు వ్యతిరేకంగా ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నా’ అంటూ రామ్‌సింగ్ సూసైడ్‌ నోట్‌లో రాశారు. Also read: 
Farmer protests: ఉద్యమంలోకి అలాంటి వారు ప్రవేశిస్తే అరెస్ట్ చేయండి


అనంతరం పోలీసులు రామ్‌సింగ్‌ భౌతిక కాయాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కల్పనా చావ్లా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి తరలించారు. ఈ క్రమంలో వేలాది మంది ఆయన అనుచరులు ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే 21 రోజులుగా కొనసాగుతున్న రైతు ( Farm bills ) నిరసనల్లో ఇది తొలి ఆత్మహత్యగా చెబుతున్నారు. Also read: Parliament: శీతాకాల సమావేశాలు రద్దు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook