పాత పెద్ద నోట్లను రద్దు చేసి నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వయస్సు, లింగబేధం, కులం, మతం, వృత్తి వంటి అంశాలతో సంబంధం లేకుండా నోట్ల రద్దు యావత్ జాతిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మన్మోహన్ సింగ్ అన్నారు. గాయాలను మానించే శక్తి కాలానికి ఉంటుందని అంటుంటారు కానీ దురదృష్టవశాత్తుగా నోట్ల రద్దు మిగిల్చిన గాయాలు రోజులు గడుస్తున్నా కొద్దీ ఇంకా తీవ్రంగా వేధిస్తున్నాయని అన్నారు.