Fourth wave scare in india: దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ (Fourth wave scare) వస్తోందేమోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీ సహా పలు నగరాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న దేశంలో రెండు వేలకుపైగా కేసులు వస్తే.. అందులో వెయ్యికి పైగా రాజధానిలో (delhi Covid Cases) రావడం విశేషం. దీంతో పలు రాష్ట్రాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను విధించారు. శుక్రవారం మద్రాస్ ఐఐటీలో 18 మందికి కొవిడ్ సోకింది. దీంతో రెండ్రోజుల్లోనే అక్కడ 30 కేసులు నమోదయినట్లు అయింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో తాజాగా 2,527 (0.56శాతం) మందికి కరోనా పాజిటివ్ గా (Corona Cases in India) నిర్ధారణ అయింది. వైరస్ తో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి మరో 1,656 మంది కోలుకున్నారు. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 54వేల 952కి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేల 149కి చేరింది. 15,079 (0.04శాతం)యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.56శాతానికి పైగా ఉంది. దేశంలో శుక్రవారం 19,13,296 మందికి కరోనా టీకాలు (Covid Vaccination in india) అందించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,87,46,72,536కు చేరింది. 


Also Read: Corona Guidelines Delhi: పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. రాష్ట్రంలోని పాఠశాలలకు కీలక ఆదేశాలు! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.