GHMC Elections 2020 - Amit Shah offers prayer at Bhagyalakshmi Temple: హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల (GHMC Elections 2020) ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముందుగా హోంమంత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం పరిసరాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పాతబస్తీలో భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. ఈ మేరకు చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ ‌షాను ముందుగా కంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, డీకే అరుణ తదితరులు స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం అమిత్ షా పాతబస్తీలో ర్యాలీ నిర్వహిస్తున్నారు.  Also read: Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది: బండి సంజయ్



Also read: Asaduddin Owaisi: ఉగ్రవాదంపై అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe