Gujarat Bus Accident: గుజరాత్ లో వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం కపురై బ్రిడ్జి జాతీయ రహదారిపై లగ్జరీ బస్సు, ట్రక్కును (Bus-Truck Collision At Vadodara National Highway) ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా...మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.  హైవేపై లగ్జరీ బస్సు ట్రక్కును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను వడోదరలోని సాయాజీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. బస్సు రాజస్థాన్‌లోని భిల్వారా నుంచి ముంబై వెళుతోంది. మృతుల్లో ఓ చిన్నారి, ఓ మహిళ, నలుగురు పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూపీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళ్తున్న కారు..ఎదురుగా వస్తున్న కంటైనర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. కారు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


ఒకే కుటుంబానికి  చెందిన నలుగురు మృతి
హర్యానాలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. హిస్సార్ జిల్లాలోని జింద్-భివానీ రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రక్కును కారు ఢీకొనడంతో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులతో సహా ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి నార్నాండ్ సబ్ డివిజన్‌లోని బాస్ గ్రామ సమీపంలోని చోటుచేసుకుంది. 


Also Read: Supreme Court: నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook