India Corona Cases Today: ఇండియాలో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,82,970 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వైరస్​తో మరో 441 మంది మరణించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు కరోనా నుంచి 1,88,157 మంది కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.


దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి


దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,79,01,241 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 4,87,202 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 18,31,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 3,55,83,039 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 



ఒమిక్రాన్ కేసుల సంఖ్య


దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,961కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ


భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 76,35,229 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,58,88,47,554కు చేరింది.


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు


ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 30,16,974 మందికి కరోనా సోకింది. 8,039 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 33,51,15,363కి చేరగా.. మరణాలు 55,72,897కు పెరిగింది.  


Also Read: Punjab Elections 2022: పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా 'భగవంత్ మాన్'..


Also Read: Gas cylinder within two hours : బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండర్, కొత్త సర్వీస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook