India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్టు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా రెండవ రోజు కూడా దేశంలో అత్యధికంగా 4 లక్షలకు చేరువలో కేసులు నమోదయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ (Corona Second Wave)రూపంలో గజగజలాడిస్తోంది. దేశం మొత్తం అతలాకుతలమవుతోంది. రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతోంది. ఆక్సిజన్, బెడ్స్, మందుల కొరతతో పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ అందక (Oxygen Shortage)ప్రాణాలు పోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 3 లక్షల 92 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు 4 లక్షల కేసులు నమోదయ్యాయి. మొన్నటి వరకూ రోజుకు 3.5 లక్షల కేసులు నమోదవుతుంటే..రెండ్రోజుల్నించి 4 లక్షలకు చేరువలో కేసులు వెలుగుచూస్తున్నాయి.


గత 24 గంటల్లో దేశంలో కోవిడ్ కారణంగా 3 వేల 689 మంది ప్రాణాలు కోల్పోయారు. 3 లక్షల మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 1 కోటి 95 లక్షల 57 వేల 457కు చేరుకుంది. కాగా కోలుకున్నవారి సంఖ్య 1 కోటి 59 లక్షల 92 వేల 271 గా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో 15 కోట్ల 68 లక్షల మంది వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. దేశంలో ప్రస్తుతం 33 లక్షల 49 వేల యాక్టివ్ కేసులున్నాయి.


Also read: Kerala Assembly Elections Results Live Updates: కేరళలో మరోసారి ఎల్డీఎఫ్‌కే అధికారమా...ఆధిక్యంలో అధికారపార్టీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook