భారత్‌లో కరోనా కేసులు (India COVID19 Positive Cases) ప్రతిరోజూ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే లక్షకు పైగా పాజిటివ్ కేసులు కావడం కోవిడ్19 ప్రభావాన్ని తెలుపుతోంది. ముఖ్యంగా జులై నెలలో కరోనా తీవ్ర స్థాయికి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 37,724 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏకంగా 648 మంది కరోనాతో మరణించారు. తాజా కేసులతో కలిపితే ఇప్పటివరకూ భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య (India Corona Positive Cases) 11,92,915 (11 లక్షల 92వేల 915)కి చేరింది. చికిత్స పొందుతూ ఆ జర్నలిస్ట్ కన్నుమూత


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు కరోనా మరణాల సంఖ్య 29 వేలకు చేరువలో ఉంది. తాజాగా నమోదైన మరణాలతో కలిపితే దేశంలో ఇప్పటివరకూ కరోనాతో 28,732 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ మేరకు జులై 22న ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం కేసులకుగానూ 7 లక్షల53 వేల50 మంది డిశ్ఛార్జ్ కాగా, ప్రస్తుతం 4లక్షల 11వేల 133 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. IPL 2020: యూఏఈలోనే ఐపీఎల్ 2020.. 3 వేదికలు


దేశంలో ఇప్పటివరకూ 1,47,24, 546 (1.47 కోట్లు) శాంపిల్స్‌కు కోవిడ్19 టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. అందులో జులై 20న ఒక్కరోజే 3 లక్షల 43వేల 243 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.  దేశ వ్యాప్తంగా 1265 ల్యాబ్స్‌లో కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..