Coronavirus updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో ( India ) కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. నిత్యం వేలల్లో కేసులు.. వందల్లో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. అయితే బుధవారం 50 వేల మార్క్ దాటిన కేసులు గురువారం మళ్లీ 50వేలకు తక్కువగా నమోదయ్యాయి. గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గింది. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రోజూ నమోదయ్యే కేసులకన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం గణనీయంగానే పెరుగుతూనే ఉంది. Also read: Kamal Haasan: రజనీకాంత్ మద్దతు కోరుతున్నాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో గురువారం ( నవంబరు 5న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 47,638 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 670 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 84,11,724 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,24,985 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


అయితే.. గురువారం కరోనాతో 54,157 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 77,65,966కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 5,20,773 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 92.32శాతం ఉండగా.. మరణాల రేటు 1.49శాతం ఉంది. Also read: Vijay: ఆ పార్టీతో నాకు సంబంధం లేదు: తలపతి విజయ్


అయితే గురువారం దేశవ్యాప్తంగా 12,20,711 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 5 వరకు మొత్తం 11,54,29,095 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. Also read: Covid-19: భారత విమాన సర్వీసులను రద్దు చేసిన చైనా


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe