భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు వరుసగా రెండోరోజు తగ్గుముఖం పట్టాయి. కానీ కోవిడ్19 తీవ్రత ప్రభావం అధికంగానే ఉంది. దీనికి తోడు బ్లాక్ ఫంగస్ కేసులు రావడంతో మరణాలు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌక్, కర్ఫూల్ కొనసాగిస్తున్నాయి. ఏపీలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించే దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణాలో 10 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో రెండు వారాలపాటు లాక్‌డౌన్ విధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో తాజాగా 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,49,65,463 (2 కోట్ల 49 లక్షల 65 వేల 4 వందల 63)కు చేరింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 4,106కు కరోనా మరణాలు సంభవించాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్(CoronaVirus) బారిన పడి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,74,390కి చేరింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది.



దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 3,78,741 మంది కరోనా మహమ్మారిని జయించారు. దేశంలో ఇప్పటివరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,11,74,076 (2 కోట్ల 11 లక్షల 74 వేల  76)కి చేరింది. దేశంలో ప్రస్తుతం 35 లక్షల 16 వేల 997 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా పాజిటివ్ కేసుల కన్నా డిశ్ఛార్జ్ కేసులే 50 వేలు అధికంగా ఉన్నా ప్రాణనష్టం మాత్రమే భారీగానే ఉంది. దేశంలో ఇప్పటివరకూ 18 కోట్ల 29 లక్షల 26 వేల 460 మంది కోవిడ్19 టీకాలు తీసుకున్నారు. ఓ వైపు కరోనాతో ప్రజల ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19(Covid-19) టీకాల పంపిణీకి తాత్కాలిక విరామం ప్రకటించాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook