India Corona Udpate: కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్నించి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దేశంలో నెల రోజుల్నించి కేసుల సంఖ్య దాదాపుగా తగ్గుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశం ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)నుంచి దాదాపుగా కోలుకుంటోంది. ఓ వైపు కరోనా నుంచి కోలుకుంటున్నా..కరోనా థర్డ్‌వేవ్ భయం వెంటాడుతోంది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించకపోవడంతో సంక్రమణ మళ్లీ పెరుగుతుందనే భయం ఆందోళన రేపుతోంది. ఇటు దేశంలో గత 24 గంటల్లో 38 వేల 164 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 507 మంది కరోనా కారణంగా మరణించారు. దేశంలో కరోనా కారణంగా ఇప్పటి వరకూ 4 లక్షల18 వేల 987 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకూ 3 కోట్ల 12 లక్షల 57 వేల 720 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో కరోనా నుంచి దేశవ్యాప్తంగా 38 వేల 652 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 3 కోట్ల 4 లక్షల 29 వేల 339 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4 లక్షల 9 వేల 394 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్(Corona vaccination) ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 41 కోట్ల 78 లక్షల 51 వేల 151 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. 


Also read: Probe on Pegasus: పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈ నెల 28న విచారణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook